స్మార్ట్​ఫోన్​ కోసం యువతి సూసైడ్​

స్మార్ట్​ఫోన్​ కోసం యువతి సూసైడ్​

జైపూర్, వెలుగు: స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం కిష్టాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. లక్షెట్టిపేట మండలం రంగపేట గ్రామానికి చెందినా రవి, సత్యమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యభర్తల మధ్య గొడవలతో ఐదేళ్లుగా సత్యమ్మ తన ఊరు కిష్టాపూర్ లో పిల్లలతో కలిసి పని చేసుకుంటూ జీవిస్తోంది. సత్యమ్మ కూతురు ప్రవలిక మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్​ చదువుతుంది. కరోన నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి కావడంతో చాలారోజులుగా తల్లిని కొనమని అడుగుతోంది. తల్లి కొనకపోవడంతో ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన ఆమె సోదరుడు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు, అక్కడినుంచి ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో శనివారం ప్రవలిక మృతిచెందింది.

For More News..

టీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​కు కోటి రూపాయల భూమి రూ. 5 లక్షలకే

కాంగ్రెస్​ నాకు అన్యాయం చేసింది.. కేసీఆర్​ అవమానించిండు

హేమంత్ హత్యలో కూలీలే కిరాయి హంతకులు