23వ అంతస్తు నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని

23వ అంతస్తు నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నానక్‌రామ్‌గూడాలోని మంత్రి అపార్టుమెంట్లో ఏకంగా 23వ అంతస్తు నుంచి దూకింది. స్థానికులు పరిగెత్తుకుంటూ వెళ్లగా తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడుతూ కన్నుమూసింది. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే తుదిశ్వాస విడిచింది. ఆత్మహత్య చేసుకున్న ఇషా రంజన్(17) ఇంటర్మీడియట్ విద్యార్థినిగా గుర్తించారు. గత కొంతకాలంగా ఈ అమ్మాయి మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యుల సమాచారం. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.