అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ జైన్ ను హైదరాబాద్ లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో నుంచి 3 కోట్ల 71 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆశీష్ జైన్ దోమలగూడలో ఇన్ఫినిటీ ఇంటర్ నెట్ ఫార్మసీ నడుపుతున్నాడు. మందుల పేరుతో భారత్ నుంచి అమెరికాతో పాటు విదేశాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు NCB అధికారులు గుర్తించారు. వెయ్యికి పైగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు అధికారులు.
మరిన్ని వార్తల కోసం..