జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్  ఫెస్టివల్  జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ తో పాటు  స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. మూడేళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహించడం తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. 

హైదరాబాద్ మహానగరం కైట్ ఫెస్టివల్ కు రెడీ అయ్యింది. రేపటి నుంచి మూడు రోజలు పాటు జరిగే పతంగుల పండక్కి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అరెంజ్ మెంట్లు చేస్తున్నారు. ఫెస్టివల్ లో 16దేశాలకు చెందిన 40మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు, 60మంది నేషనల్ కైట్ క్లబ్ సభ్యులు పతంగులు ఎగురవేయనున్నారు. 

ఇక మరోవైపు స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్ లో అందుబాటులో ఉంచనున్నారు నిర్వాహకులు. వీటితో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ఉండనున్నాయి. సందర్శకులెవ్వరికీ అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతరశాఖల అధికారులు. కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

గతం లో కైట్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు విజిటర్స్ నుంచి మంచి స్పందన రావడం తో పాటు ఇంటర్నేషనల్  కైట్ ఫేయర్స్ వచ్చారు. దీంతో ఈసారి ఫెస్టివల్ లో డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జెంట్ పథంగా ఇలా స్పెషల్ కైట్స్ ఎగరవేసేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సాయంత్రం వేళ  కల్చరల్   ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.