
హుజూర్ నగర్, వెలుగు : మైనింగ్ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని హుజుర్ నగర్ కు చెందిన ఐఎన్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ గురువారం హైదరాబాద్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన నాయకులను ఎప్పుడు గుర్తిస్తుందన్నారు. వివేక్మంత్రి కావడంతో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.