మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ గర్ల్స హాస్టల్ లో బాలికపై లైంగిక వేధింపుల కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగుతుంది. ఆర్డీఓతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల సమక్షంలో విచారణ జరుగుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. బాలికలు, స్టాఫ్, కోచ్ లను వేర్వేరుగా విచారిస్తున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణను కూడా అధికారులు విచారిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం ఈ నివేదికను మేడ్చల్ కలెక్టర్ కు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇవ్వనున్నారు.