ఐపీఎల్ వేలంలో సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్క్ ను మళ్లీ ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అతడిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో అర్జున్ ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై. గత ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అర్జున్..మరి ఈ సారైనా ఆడే అవకాశం వస్తుందో లేదో చూడాలి.
ఇక కుల్దీప్ యాదవ్ ను రూ. 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ , టిమ్ సౌథీని కోల్ కతా రూ. 1.50 కోట్లకు కొనుగోలుచేసింది. కరుణ్ నాయర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.40 కోట్లకు దక్కించుకుంది. వృద్ధిమాన్ సాహా ను రూ.1.90 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. డేవిడ్ మిల్లర్ ను రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
Arjun Tendulkar is SOLD to @mipaltan for INR 30 Lakh #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 13, 2022