
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రంలోని టీచింగ్హాస్పిటల్అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి రూలింగ్పార్టీకి చెందిన లీడర్సపోర్ట్తో సూపరింటెండెంట్ చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటే వెలుగుచూస్తున్నాయి. ఓవైపు కొవిడ్ పేషెంట్లతో జిల్లా ఆసుపత్రి కిటకిటలాడుతుంటే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అధికారి కాసుల కోసం అడ్డదారులు తొక్కారని, ప్రొఫెసర్లు నర్సింగ్హోంలు నడుపుకొనేందుకు అనధికారికంగా పర్మిషన్ ఇచ్చి, అటెండెన్స్వేస్తూ నెలనెలా మామూళ్లు దండుకుంటున్నారనే ఫిర్యాదులు చీఫ్ సెక్రటరీ దాకా వెళ్లాయి. దీంతో ఆగమేఘాల మీద సూపరింటెండెంట్ను బాధ్యతల నుంచి తొలగించిన సీఎస్, ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
టీచింగ్ స్టాఫ్ అటెండెన్స్లో అక్రమాలు
కరోనా విజృంభణతో జిల్లా టీచింగ్ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి ఎక్కువైంది. ఇదే అదనుగా హాస్పిటల్లో అక్రమాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సూపరింటెండెంట్.. స్టాఫ్నడుమ గ్యాప్ పెరిగిపోయింది. తమ పట్ల సూపరింటెండెంట్దురుసుగా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లు, స్టాఫ్ఆగ్రహంతో ఉన్నారు. ఇది చాలదన్నట్లు టీచింగ్ స్టాఫ్, ప్రైవేటు ల్యాబ్ టెక్నిషియన్ల నుంచి పర్సెంటేజీలు దండుకుంటున్నారనే ఆరోపణలు సూపరింటెండెంట్మెడకు చుట్టుకున్నాయి. ఇటీవల కాలంలో కొవిడ్ పేషెంట్లకు సప్లై చేసిన రెమ్డిసివిర్, మెడికల్ కిట్లు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. టీచింగ్ స్టాఫ్ వ్యవహారంపై పెద్ద దుమారమే లేచింది. ఇక్కడ పని చేస్తున్న 50 మంది ప్రొఫెసర్లు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీళ్లలో కొందరు సొంతంగా క్లినిక్లు నడిపిస్తూ డ్యూటీలు ఎగ్గొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాకు నెలకు రూ.20 వేల చొప్పున సూపరింటెండెంట్కు ముట్టచెప్తున్నారనే ఆరోపణలున్నాయి. అటెండెన్స్ మ్యానేజ్ చేస్తున్నందుకే ప్రతి నెలా రూ.7లక్షల వరకు చేతులు మారేవని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. రూలింగ్ పార్టీ లీడర్ కు కూడా నెలనెలా సొమ్ము ముట్టజెప్పడం వల్లే ఇన్నాళ్లూ ఈ వ్యవహారం గుట్టుగా జరిగిందని, అందువల్లే డీఎంఈకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన ‘వెలుగు’తో పేర్కొన్నారు.
ల్యాబ్ టెక్నిషియన్ల నుంచి రూ.5వేల చొప్పున..
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్ టెక్నిషియన్లకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ సూపరింటెండెంట్చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్లో రూల్స్పాటించకుండా సుమారు ఐదు వేల మంది నుంచి ఒక్కో సర్టిఫికెట్కు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఏడాది కాలంగా సూపరింటెండెంట్ పై వచ్చిన ఈ అక్రమాలపై గతంలో ఒకసారి డీఎంఈకి ఫిర్యాదు చేశారు. నిజానికి టీచింగ్హాస్పిటల్కు ప్రొఫెసర్ స్థాయి కలిగిన వ్యక్తిని సూపరింటెండెంట్గా నియమిం చాలి. కానీ ఓ అధికార పార్టీ నేత సపోర్ట్తో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి కలిగిన వ్యక్తిని సూపరింటెండెంట్ గా నియమించారు. దీని పైన డీఎంఈకి ఫిర్యాదు చేయడంతో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ విచారించి రిపోర్ట్ పంపింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు
తీసుకోలేదు.