రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే రైల్వే పనులు పెండింగ్ : ఎంపీ అర్వింద్

రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే  రైల్వే పనులు పెండింగ్ : ఎంపీ అర్వింద్

కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. గోవింద్ పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు చెప్పారు. జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు రూ.67 కోట్లతో నిర్మిస్తున్నామన్న ఆయన.. మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.4400 కోట్లతో రైల్వే లైన్లు అభివృద్ధి చేస్తున్నట్లు అర్వింద్ ప్రకటించారు. నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్ల అధునికీకరణకు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.