పంత్కు ఏమైంది..? ప్రమాదం గురించి తెలిసి షాకైన ఇషాన్ కిషన్

పంత్కు ఏమైంది..? ప్రమాదం గురించి తెలిసి షాకైన ఇషాన్ కిషన్

రిషబ్ పంత్ కారు ప్రమాద ఘటనపై టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ షాక్కు గురయ్యాడు.  రంజీ ట్రోఫీలో  భాగంగా జార్ఖండ్ తరపున ఆడుతున్న సమయంలో రిషబ్ పంత్ కారు ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఇషాన్ కిషన్..షాకయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో..గ్యాలరీలో కూర్చున్న అభిమానులు ఇషాన్ కిషన్కు విషయాన్ని తెలియజేశారు. దీంతో ఇషాన్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఏమైంది అని మళ్లీ అడిగాడు.

https://twitter.com/twstopsfreespch/status/160869446587895398

రంజీ ట్రోఫీలో భాగంగా ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు ఆడుతున్నాడు. ఈ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఇషాన్ను కొందరు అభిమానులు సెల్ఫీలు కోరారు. ఫ్యాన్స్కు సెల్ఫీలు ఇస్తుండగా..రిషబ్ పంత్ కారు ప్రమాదంపై ఓ అభిమాని ఇషాన్కు తెలియజేశాడు. రిషబ్ పంత్ కా యాక్సిడెంట్ హో గయా హై (రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యాడు) అని ఒక అభిమాని చెప్పాడు.  ఏమి జరిగిందో విని షాక్ అయిన కిషన్ ఇలా స్పందించాడు: "క్యా? (ఏమిటి) అని స్పందించాడు. ఆ తర్వాత విషయాన్ని తెలియజేసిన ఫ్యాన్స్...ప్రమాదం గురించి ఎక్కువగా ఆలోచించవద్దని..మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని కోరారు.

భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ రూర్కీలోని తన స్వగ్రామానికి వెళుతుండగా ఢిల్లీ -డెహ్రాడూన్ హైవేపై కారు ప్రమాదానికి గురయ్యాడు. పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.  కారు విండ్ను పగులకొట్టిన పంత్ బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు  తీవ్రమైన గాయాలయ్యాయి, ఆ తర్వాత అతన్ని  డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.