కర్నాటకలోని బెంగళూరులో భారీగా డబ్బు పట్టుకున్నారు ఐటీ అధికారులు. ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేకపోవడంతో 42 కోట్లు సీజ్ చేశారు.
బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఐటీ అధికారులు అక్టోబర్ 12 వతేదిన గురువారం రాత్రి బెంగళూరులోని ఆర్టీ నగర్ లో సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ , ఆయన బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టెలో భారీగా నగదును గుర్తించారు. మొత్తం 22 బాక్సుల్లో 42 కోట్లు ఉన్నాయి.
మొత్తంగా 50 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే 8 కోట్ల రూపాయలు తెలంగాణ తరిలించినట్టు గుర్తించారు అధికారులు. . కర్ణాటకు చెందిన కాంగ్రెస్ నేత డబ్బుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు