ఇంత డబ్బా : కర్నాటక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.42 కోట్లు : అట్టపెట్టెల్లో 500 నోట్ల కట్టలు

ఇంత డబ్బా : కర్నాటక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.42 కోట్లు : అట్టపెట్టెల్లో 500 నోట్ల కట్టలు

కర్నాటకలోని బెంగళూరులో భారీగా డబ్బు పట్టుకున్నారు ఐటీ అధికారులు.  ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేకపోవడంతో  42 కోట్లు సీజ్ చేశారు. 

బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు  ఐటీ అధికారులు అక్టోబర్ 12 వతేదిన  గురువారం రాత్రి బెంగళూరులోని ఆర్టీ నగర్ లో   సోదాలు నిర్వహించారు.   కాంగ్రెస్‌ మాజీ కార్పొరేటర్‌ , ఆయన బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టెలో  భారీగా నగదును గుర్తించారు. మొత్తం 22 బాక్సుల్లో 42 కోట్లు ఉన్నాయి. 

మొత్తంగా 50 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే 8 కోట్ల రూపాయలు తెలంగాణ తరిలించినట్టు గుర్తించారు అధికారులు. . కర్ణాటకు చెందిన కాంగ్రెస్ నేత డబ్బుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు