వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రైతుకు నష్టమే

వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రైతుకు నష్టమే

న్యూఢీల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై దాడి చేసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రైతుకు నష్టమేనన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసెంబ్లీ సెషన్ పెట్టడం తనకు సంతోషాన్నిస్తోందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతులు, కార్మికులకు మేలు చేసేవే అయితే… పార్లమెంట్ లో చర్చ జరగకుండానే ఎందుకు పాస్ చేశారని రాహుల్ ప్రశ్నించారు.