యాసంగిలో వడ్లు కొనం అని చెప్పడం సిగ్గుచేటు

యాసంగిలో వడ్లు కొనం అని చెప్పడం సిగ్గుచేటు
  • మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ జిల్లా: యాసంగిలో వడ్లు కొనం అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాసంగిలో వడ్లు వేసుకోండి అని చేప్పిన బీజేపీ నేతలను నిలదీయాలని ఆయన కోరారు. వడ్లు కొనకపోతే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా నిలదీయాలన్నారు. ఎంపీ కవిత కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించేందుకు రేపు మంత్రికేటీఆర్ మహబూబాబాద్ వస్తున్న విషయం తెలిసిందే.