హైదరాబాద్లో చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అమీర్ పేట, కూకట్ పల్లి, శంషాబాద్ లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూజాకృష్ణ ఎండీ కృష్ణ ప్రసాద్ ఇల్లు ఆఫీసులతో పాటు శంషాబాద్ రఘువీర్ ఇల్లు, ఇందు ఫార్చ్యూన్ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి.
పూజాకృష్ణ సంస్థకు కృష్ణప్రసాద్ దొప్పలపూడి మేనేజింగ్ డైరెక్టర్గా, సోమేపల్లి నాగరాజేశ్వరి, దొప్పలపూడి పూజాలక్ష్మి డైరెక్టర్లుగా ఉన్నారు. కార్యాలయం ఎదురుగానే ఉన్న వీరి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగవేశారని.. పెట్టుబడులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారనే ఆరోపణల్లో భాగంగా భాగంగా వీరిపై సోదాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాల్లో చెన్నై ఆదాయపన్ను శాఖ బృందాలు సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది.