హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఐటీ  సోదాలు

బషీర్ బాగ్ లోని మీనాక్షి, మంజీరా కెమికల్స్ ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మూడు చోట్ల, గుంటూరులో రెండు చోట్ల ఈ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం. ఈ మేరకు మొత్తం 14 బృందాలతో కలిసి ఏకకాలంలో ఆదాయపు పన్ను  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

గుంటూరు, రాజమండ్రిలోని మంజీరా కెమికల్స్ కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం. ఆ సంస్థ డైరెక్టర్ సురేష్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ ఆఫీసర్లు సెర్చింగ్ చేస్తు్న్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.