వంశీరామ్ బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు

వంశీరామ్ బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు

రాష్ట్రంలో హైదరాబాద్‭తో పాటు పలు జిల్లాల్లో మరోసారి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లోని వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డితో పాటు ఆయన బావమరిది కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

గత నెల (నవంబర్)లో హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేసింది. విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు పంపింది. అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఇళ్లలో కూడా ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి.