నాగార్జున సాగర్‌‌‌‌ స్పిల్‌‌‌‌వే రిపేర్లు ఈ ఏడాదీ లేనట్లే !..భారీ స్థాయిలో గుంతలు పడి దెబ్బతింటున్నస్పిల్‌‌‌‌వే

నాగార్జున సాగర్‌‌‌‌ స్పిల్‌‌‌‌వే రిపేర్లు ఈ ఏడాదీ లేనట్లే !..భారీ స్థాయిలో గుంతలు పడి దెబ్బతింటున్నస్పిల్‌‌‌‌వే
  • తాత్కాలిక పనులకు జనవరిలో రూ.160 కోట్లతో ప్రపోజల్స్
  • పర్మినెంట్‌‌‌‌ పనులు చేయాలన్న డిమాండ్‌‌‌‌తో ఆగిన టెంపరరీ వర్క్స్‌‌‌‌
  • ప్రాజెక్ట్‌‌‌‌కు ఈ నెలాఖరులోగా వరద వచ్చే చాన్స్‌‌‌‌
  • ప్రాజెక్ట్‌‌‌‌కు ఈ నెలాఖరులోగా వరద వచ్చే చాన్స్‌‌‌‌

నల్గొండ/హాలియా, వెలుగు : లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తున్న నాగార్జున సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ స్పిల్‌‌‌‌వే రిపేర్లు ఈ ఏడాది కూడా లేనట్లే కనిపిస్తున్నాయి. స్పిల్‌‌‌‌వేపై గుంతలు పడడంతో తాత్కాలికంగా రిపేర్లు చేసేందుకు ఇటీవల చర్యలు చేపట్టగా.. సంబంధిత నిపుణులు సైతం స్పిల్‌‌‌‌వేను పరిశీలించారు. కానీ టెంపరరీ పనులు కాకుండా.. పర్మినెంట్‌‌‌‌ పనుల కోసం ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేయాలని నిర్ణయించడంతో రిపేర్లు పెండింగ్‌‌‌‌లో పడ్డాయి. అయితే రిజర్వాయర్‌‌‌‌కు ఈ నెలాఖరు నాటికే వరద వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు రిపేర్లు చేయడం కష్టంగా మారింది.

రెండేండ్లలోనే బయటపడ్డ లోపాలు

నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు. ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తిగా నిండిన తర్వాత క్రస్ట్‌‌‌‌ గేట్లను పైకి ఎత్తుతుండడంతో 590 అడుగుల ఎత్తు నుంచి నీరు కింద పడుతుంది. దీంతో నీటి ఉధృతి కారణంగా స్పిల్‌‌‌‌వేపై గుంతలు పడుతున్నాయి. 2023లో సుమారు రూ.19 కోట్లు ఖర్చు చేసి స్పిల్‌‌‌‌వేకు రిపేర్లు చేపట్టారు. ఈ పనులు దక్కించకున్న స్వప్న కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ కంపెనీ స్పిల్‌‌‌‌వేపై పడిన గుంతలను ఆధునిక పద్ధతుల ద్వారా పూడ్చామని, భవిష్యత్‌‌‌‌లో వరద ఉధృతి పెరిగినా కాంక్రీట్‌‌‌‌ చెదిరిపోకుండా విదేశాల నుంచి తెప్పించిన ఎం60 గ్రేడ్‌‌‌‌ సిలికాన్‌‌‌‌ ఫైబర్‌‌‌‌ రీ ఇన్ఫోర్స్‌‌‌‌డ్ కాంక్రీట్‌‌‌‌ను ఉపయోగించామని పేర్కొంది. కానీ గతేడాది ఆగస్ట్‌‌‌‌ మొదలుకొని నవంబర్‌‌‌‌ వరకు కృష్ణా నదికి వరదలు రావడంతో క్రస్ట్‌‌‌‌ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నీరు అధిక ఒత్తిడితో స్పిల్‌‌‌‌వే మీదుగా జారి బకెట్‌‌‌‌ పోర్షన్‌‌‌‌ను తగిలి ఎగిసి పడ్డాయి. ఈ క్రమంలో స్పిల్‌‌‌‌వేపై మరోసారి భారీ స్థాయిలో గుంతలు పడ్డాయి. 

రూ.160 కోట్లతో జనవరిలో ప్రపోజల్స్‌‌‌‌

సాగర్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో డ్యామ్‌‌‌‌ మెయింటెనెన్స్‌‌‌‌ కేఆర్‌‌‌‌ఎంబీ పరిధిలోకి వెళ్లింది. దీంతో ప్రాజెక్ట్‌‌‌‌ రిపేర్లను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో సాగర్‌‌‌‌ స్పిల్‌‌‌‌వేపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి నేతృత్వంలో జనవరి 7న ఉత్తరాఖండ్‌‌‌‌లోని ఐఐటీ రూర్కీ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో రూర్కి ఐఐటీ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ మార్చిలో సాగర్‌‌‌‌ను పరిశీలించి ప్రాథమిక నివేదికను రెడీ చేశారు. జూన్‌‌‌‌ మొదటి వారంలో మరోసారి స్పిల్‌‌‌‌వేను పరిశీలించిన నిపుణులు తాత్కాలిక రిపేర్లకు సంబంధించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఈ పనుల కోసం రూ. 160 కోట్లతో ప్రపోజల్స్‌‌‌‌ 
రెడీ చేశారు.