- ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్తో ఈజీగా లోన్లు
- బారోవర్లు అప్పులో 6 శాతం ఆదా చేయొచ్చు
- బ్యాంకుల ఖర్చులో 70 శాతం తగ్గుతుంది
- ఆర్బీఐ సీనియర్ అధికారి వెల్లడి
- ఆరు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్ట్
న్యూఢిల్లీ : బ్యాంక్ కస్టమర్లు ఇక నుంచి లోన్లు తీసుకోవడం మరింత ఈజీగా మారనుంది. ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ ప్లాట్ఫామ్తో లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు చేసే ఖర్చులు 70 శాతం మేర తగ్గుతాయని ఆర్బీఐ ఫిన్టెక్ డిపార్ట్మెంట్ హెడ్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. బారోవర్లు (అప్పులు తీసుకునేవారు) లోన్ అమౌంట్లో 6 శాతం వరకు ఆదా చేసుకోగలుగుతారని చెప్పారు. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ డెవలప్ చేసిన ‘ది పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్’ తో లోన్లను ఆన్లైన్లోనే వేగంగా పొందడానికి వీలుంటుంది.
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఈ ప్లాట్ఫామ్కు కనెక్ట్ అయ్యి బారోవర్ల ఇన్ఫర్మేషన్ను డిజిటల్గా పొందొచ్చు. ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ ప్లాట్ఫామ్ రిటైల్ లెండింగ్లో గూగుల్ సెర్చ్లా పనిచేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ బ్యూరో ఏజెన్సీలు, అకౌంట్ అగ్రిగేటర్ల నుంచి బారోవర్ల ఇన్ఫర్మేషన్ను సేకరించి ఒక దగ్గర ఈ ప్లాట్ఫామ్ చేర్చుతుంది. ఆధార్ ఈ–-కేవైసీ, ఆధార్ ఈ–-సైనింగ్, పాన్ వ్యాలిడేషన్ వంటివి చేసుకోవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే డిజిటల్ కేసీసీ (కిసాన్ క్రెడిట్ కార్డ్) లెండింగ్తో ఈ ఇనీషియేటివ్ పైలెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది.
ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ ప్లాట్ఫామ్ పైలెట్ ప్రాజెక్ట్ను మధ్యప్రదేశ్, తమిళనాడులో లాంచ్ చేశారు. రూ.1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్, డెయిరీ లోన్స్, కొలేటరల్ లేని ఎంఎస్ఎంఈ లోన్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ ఈ విధానంలో ఇస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఈ పైలెట్ ప్రాజెక్ట్ను ఆగస్టు 17 నుంచి అమలు చేస్తున్నారు. ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ ప్లాట్ఫామ్తో రైతులు బ్యాంకులు చుట్టూ తిరగడం తగ్గుతుందని అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు.
డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉండడంతో బ్యాంకులు వేసే ట్రెడీషనల్ ఛార్జీలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. ‘ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ ప్లాట్ఫామ్తో అప్పులివ్వడంలో బ్యాంకుల సామర్ధ్యం మెరుగుపడుతుంది. లోన్లు ఇవ్వడానికి చేసే ఖర్చులు తగ్గుతాయి. డిస్బర్స్మెంట్ వేగంగా ఉంటుంది. ఎక్కువ మందికి లోన్లను ఒకేసారి ఇవ్వొచ్చు’ అని ఎనలిస్టులు అన్నారు.
అడ్మిషన్ లెటర్ ఉంటే చాలు ఎడ్యుకేషన్ లోన్..
ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ విధానంతో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవడం మరింత ఈజీగా మారనుంది. అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మారుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ కొత్త విధానంతో బారోవర్లు పేపర్వర్క్కు గుడ్బై చెప్పేయొచ్చు. అడ్మిషన్ లెటర్ ఉంటే చాలు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. డిజిటల్గా అడ్మిషన్ లెటర్ ఉన్నా లోన్ తీసుకోవచ్చు. ‘ఫ్రిక్షన్లెస్ క్రెడిట్’ విధానాన్ని వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తామని జీ20 సమ్మిట్లో పాల్గొన్న ఆబీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకునే స్టూడెంట్లపై భారం తగ్గుతుందని, ఎడ్యుకేషన్ ఫైనాన్షింగ్ మరింత మెరుగవుతుందని చెప్పారు. ఫైనాన్షియల్ సెక్టార్లో తెచ్చిన వివిధ డిజిటల్ ఇనీషియేటివ్స్ను జీ20 సమ్మిట్, న్యూఢిల్లీలో ఆర్బీఐ ప్రదర్శనకు ఉంచింది. ఇందులో ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ పబ్లిక్ టెక్ ఫ్లాట్ఫామ్, సీబీడీసీ (డిజిటల్ రూపాయి), యూపీఐ, రూపే, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ వంటివి ప్రదర్శనకు ఉంచారు.