జైలులో మర్మాంగాలను కత్తిరించుకున్న ఖైదీ

జైలులో మర్మాంగాలను కత్తిరించుకున్న ఖైదీ

జైలులో ఉన్న ఖైదీ తన మర్మంగాలను తానే కత్తిరించుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గ్వాలియర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఒక గుడి ఉంది. అక్కడ జైలులోని ఖైదీలు నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. మంగళవారం కూడా ఖైదీలు ప్రార్థనలు చేస్తుండగా.. ఒక నేరస్థుడు ఒక్కసారిగా లేచి నిలబడి స్పూన్ తో తన జననాంగాలను కత్తిరించుకున్నాడు.

‘మే 5న గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న దోషుల్లో ఒకరు జైలు ప్రాంగణంలోని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నాడు. అతను అకస్మాత్తుగా లేచి నిలబడి హవాన్ కోసం ఉపయోగించే చెంచాతో తన మర్మాంగాలను కత్తిరించుకున్నాడు. ఆ ఖైదీ 2018 నుంచి జైలులో ఖైదీగా ఉన్నాడు’ అని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు.

For More News..

కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి