ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేను: జైట్లీ

ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేను: జైట్లీ

కేంద్రమంత్రి వర్గంలో తాను భాగం కాలేనని, అవసరమైతే సలహాలు ఇస్తానన్నారు బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ. దీనికి సంబంధించి నరేంద్ర మోడికి లేఖ రాశారు. జైట్లీ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. “నా ఆరోగ్యానికి, చికిత్సకు తగినంత సమయం కావాలి. కాబట్టి ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేను. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని  లెటర్ లో తెలిపారు.  అయితే తాను ఐదేళ్ల పాటు నరేంద్ర మోడీ సారథ్యంలో పనిచేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిపారు. అయితే గత 18 నెలలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. తగినంత విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని.. భవిష్యత్తులో కొన్ని బాధ్యతలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని జైట్లీ చెప్పారు.