టాలీవుడ్లో మరోసారి క్రేజీ కాంబో రిపీట్ కానుంది. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఇప్పటికే జేజీఎం (జనగణమన) చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో..భారీ అంచనాలు నెలకొన్నాయి.
JGM SHOOT BEGINS ?
— Puri Connects (@PuriConnects) June 4, 2022
Welcoming @hegdepooja on Board ✨@TheDeverakonda - #PuriJagannadh #JGM ??
- https://t.co/tuYkVI8op8
WW Release on AUG 3rd 2023@Charmmeofficial @directorvamshi @PuriConnects #SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/JpsPrRSSYg
ఈ పాన్ ఇండియా ఫిల్మ్లో విజయ్కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పైన డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. మిలిటరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ,మలయాళ భాషల్లో రూపొందుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 3న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ వీడియో ఆకట్టుకుంటోంది.
ఇక 2011లో నువ్విలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..పెళ్లిచూపులతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, మహానటి, గీతా గోవిందంతో వరుస విజయాలను అందుకున్నాడు. టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ చిత్రాలు డిజాస్టర్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న అతను..వరల్డ్ ఫేమస్ లవర్తో పలకరించాడు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. పూరీ డైరెక్షన్లోనే నటించిన లైగర్పై ఆశలు పెట్టుకున్నా..కరోనా కారణంగా విడుదల లేటయింది. అయితే ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. అటు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమాను అనౌన్స్ చేసిన విజయ్..తాజాగా పూరీతో జనగణమణ సినిమాను మొదలు పెట్టాడు.
మరిన్ని వార్తల కోసం..
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలు
ది వారియర్ నుంచి రెండో సాంగ్ విడుదల