రైతు సౌభాగ్య దీక్ష చేపట్టిన పవన్

రైతు సౌభాగ్య దీక్ష చేపట్టిన పవన్

ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ కాకినాడలో  రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాగబాబుతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, రైతు సంఘాల నేతలు పచ్చకండువాలతో హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి రైతులు కూడా భారీగా  వచ్చారు. జేఎన్టీయూ దగ్గర చేపట్టిన  ఈ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రైతుల నుంచి పవన్ వినతులను స్వీకరించనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.