బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియంలో నేడు(గురువారం) జనసేన బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష లు విధించారు. ఈసభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ,బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర మాజీ మంత్రులు హాజరుకానున్నారు.ఎల్బీ స్టే డియం పరిసర ప్రాం తాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సభ జరుగనున్న సాయంత్రం 4నుంచి రా త్రి 7.30 గంటలవరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబా ద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు…
…AR పెట్రోల్ పంప్ జంక్షన్ నుం చి BJR విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాం పల్లి,చాపెల్ రోడ్,రవీంద్ర భారతి వైపు మళ్లించారు.
…అబిడ్స్,గన్ ఫౌండ్రీ నుం చి బీ జేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్బీ ఐ గన్ ఫౌండ్రీ,చాపెల్ రోడ్ వైపు మళ్లించారు.
…బషీర్ బా గ్ నుం చి జీపీఓ,అబిద్స్ వైపు వెళ్లే వాహనాలు బషీర్ బా గ్ జంక్ష న్ నుం చి హైదర్ గూడా, కింగ్ కోఠి మీదుగా వెళ్లాలి .
…ఓల్డ్ ఎమ్మెల్యే క్వా ర్టర్స్ నుం చి బషీర్ బా గ్ వైపువచ్చే వాహనదారులను హి మాయత్నగర్ వై జంక్షన్ వైపు అనుమతిస్తారు.
…కింగ్ కోఠి నుంచి భారతీయ విద్యా భవన్ ద్వారా బషీర్ బా గ్ వైపు వచ్చే వాహనదారులను కింగ్ కోఠి క్రాస్ రోడ్ నుంచి తాజ్మహల్ లేదా ఇడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు.
… ట్యాం క్ బండ్ అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలు లి బర్టీ,హిమాయత్ నగర్ మీదుగా ఇలా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష లు విధించారు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
పార్కింగ్ పాయింట్స్…
వీఐపీ వాహనాలు:- ఎస్సీఆర్టీ,అగ్రికల్చర్ ఆఫీస్,మహబూబియా కాలేజ్
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు:- ఎన్టీఆర్ స్టే డియం, నెక్లెస్ రోడ్స్ ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, మెహిదీపట్నం,
ఓల్డ్ సిటీ వాహనాలు:- పబ్లిక్ గార్డెన్స్ ముషీరాబాద్, అంబర్ పేట్,
హిమాయత్ నగర్ నుంచి వచ్చే వాహనాలు:- నిజాం కాలేజ్ గ్రౌండ్స్ దగ్గర
మీడియా వెహికిల్స్:- అలియా కాలేజ్