
స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు విస్తృతంగా వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీలతో జపాన్ తొలిసారిగా ఓ సబ్ మెరైన్ ను నడుపుతోంది. దాదాపు 2002 నుంచే లిథియం అయాన్ సబ్మెరైన్ను రంగంలోకి దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆ దేశం.. ఇన్నాళ్లకు ప్రాజెక్టును పూర్తి చేసింది. ‘ఓర్యూ’ అనే సబ్ మెరైన్ను ఈ నెల 5న సర్వీస్లోకి ప్రవేశపెట్టింది. ఓర్యూను 2018లోనే ప్రారంభించినా, టెక్నికల్ రీజన్స్ వల్ల సర్వీస్లోకి తీసుకోవడం మాత్రం ఆలస్యమైంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాసిడ్ బ్యాటరీల సబ్మెరైన్ ల కన్నా లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే సబ్ మెరైన్లకు మెయింటెనెన్స్ చాలా తక్కువవుతుందట. బ్యాటరీలు ఎక్కువ కాలం పని చేస్తాయని, సబ్మెరైన్ వేగం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఓర్యూ సబ్ మెరైన్ నీటిలో మునిగినప్పుడు గరిష్టంగా 20 నాట్ల వేగంతో, నీటిపై తేలుతూ అయితే 13 నాట్ల వేగంతో వెళుతుందట. 276 ఫీట్ల పొడవుండే దీంట్లో 65 మంది ఉండొచ్చట.