మరోసారి ఆసుపత్రిలో చేరిన జపాన్ ప్రధాని

మరోసారి ఆసుపత్రిలో చేరిన జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని షింజో అబే అనారోగ్య సమస్యలతో  మరోసారి ఆసుపత్రిలో చేరారు. టోక్యో  ఆస్పత్రి డాక్టర్లు దాదాపు ఏడు గంటలపాటు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రధాని ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జులై 6న షింజో అబే తన కార్యాలయంలో బ్లెడ్ వామిట్స్ చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ప్రధాని సాధారణ పరీక్షల్లో భాగంగానే  ఆస్పత్రికి వచ్చారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్థిక మంత్రి కట్సునోబు కటో తెలిపారు. ప్రధాని పదవి నుంచి షింజో వైదొలగితే ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని రాజీనామా చేయాలనుకుంటే ఎన్నికలు ముగిసి మరొకరు ప్రధాని అయ్యే వరకు షింజోనే ఆ పదవిలో కొనసాగుతారని సమాచారం.