టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రేపటినుంచి శ్రీలంకతో మెదలయ్యే 3 వన్డేల సిరీస్ కు ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్ల సిరీస్ కోసం ముందుగా బీసీసీఐ బుమ్రాను ఎంపిక చేసింది. అయితే చివరి నిమిషంలో అతన్ని తప్పించింది. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. ఇప్పటికే 2,1 తేడాతో లంకపై టీ20 సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది.
శ్రీలంక మూడు వన్డేల సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్,చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.