రవితేజ, అనుదీప్ మూవీపై క్రేజీ అప్డేట్.. హీరోయిన్ కూడా ఫిక్స్

రవితేజ, అనుదీప్ మూవీపై క్రేజీ అప్డేట్.. హీరోయిన్ కూడా ఫిక్స్

జాతిరత్నాలు(Jathirathnalu) సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అనుదీప్(Anudeep). కరోనా తరవాత థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయంతోపాటు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్. అదే ఊపుతో రెండు సినిమాగా ప్రిన్స్ సినిమాను తెరకెక్కించాడు ఈ దర్శకుడు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచనం ఈ సినిమా ప్లాప్ రిజల్ట్ ను మూటగట్టుకుంది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాదించలేదు. దీంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు అనుదీప్. 

ఇక తాజాగా ఆ దర్శకుడు తరువాతి సినిమాపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉండాలి సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ ను సెలెక్ట్ చేశాడట అనుదీప్. జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్ ఫుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

ఇక రవితేజ విషయానికి వస్తే.. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్ మూవీ ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ సినిమా రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తరువాత అనుదీప్ తో సినిమా చేయనున్నాడు రవితేజ. మరి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.