NDA కు JDU,అప్నాదళ్ షాక్

NDA కు JDU,అప్నాదళ్ షాక్

NDA సర్కార్‌ కొలువు తీరకముందే లుకలుకలు మొదలయ్యాయి.BJP మిత్రపక్షమైన JDU మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఏర్పడనున్న కేబినెట్ లో రెండు మంత్రి పదవులు కావాలని కోరింది JDU. అయితే ప్రస్తుతానికి ఒకే మంత్రి పదవి కేటాయిస్తామనడంపై జేడీయూ నిరాకరించింది. కేంద్ర మంత్రివర్గంలో చేరబోమంటూ ప్రకటన చేసింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని…NDA కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు JDU చీఫ్‌ నితీశ్‌ కుమార్‌. JDUతో పాటు అప్నాదళ్ కూడా ఎలాంటి పదవులు తీసుకోబోమని తేల్చి చెప్పి…NDA కు ఝలక్ ఇచ్చాయి మిత్రపక్షాలు.