మెషినరీ పడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పేట్బషీరాబాద్పోలీస్ స్టేషన్పరిధిలో ఘటన

మెషినరీ పడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పేట్బషీరాబాద్పోలీస్ స్టేషన్పరిధిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: ఓ ఫ్యాక్టరీలో మెషినరీ కార్మికులపై పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పేట్​బషీరాబాద్​పోలీస్ స్టేషన్​పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్​నగర్​లో సతీశ్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి ఎస్ఎస్ఆర్​ ఎంటర్​ప్రైజెస్​పేరుతో ప్యానల్​ఉత్పత్తుల కంపెనీ నిర్వహిస్తున్నారు. 

గురువారం ఈ ఫ్యాక్టరీకి కొత్త యంత్రాలు వచ్చాయి. వాటిని కార్మికులు సాయి, శివం తిరుపతిరెడ్డి, లింగాల పవన్​కుమార్​ దించుతున్నారు. ఆ సమయంలో మెషినరీ మీద పడటంతో సాయి అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్​ డ్రైవర్​ దీపక్, యజమానులు సతీశ్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి భద్రతాచర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబసభ్యులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.