రాజశేఖర్ కోలుకుంటున్నాడు..

రాజశేఖర్  కోలుకుంటున్నాడు..

ఇటీవల కరోనా బారిన పడ్డ నటుడు రాజశేఖర్ కోలుకుంటున్నారని ఆయన భార్య జీవిత తెలిపారు.  సిటీ  న్యూరో  సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. డాక్టర్లు ఆయనను నిత్యం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారన్నారు. వెంటిలేటర్ పై ఉన్నారన్న వార్తలను ఆమె తప్పుబట్టారు.  రాజశేఖర్ కు  సీరియస్ గా ఉన్నప్పటికీ ఆయనకు ఐసీయూలోనే ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేశారన్నారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రుల ప్రార్థన వల్లే రాజశేఖర్ త్వరగా కోలుకున్నారన్నారు.

ఇటీవల జీవిత, రాజేశేఖర్ ఆయన కూతుళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన కూతుళ్లు, జీవిత త్వరగా కోలుకున్నారు. కానీ రాజశేఖర్ కోలుకోలేదు. సిటీ సెంటర్ న్యూరో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. డాడీ త్వరగా కోలుకునేలా ప్రార్థించాలంటూ ఆమె కూతురు శివాణి ఇటీవల అభిమానులను కోరారు.