హైదరాబాద్ లలితా జువెలర్స్ లో నగలు చోరీ

హైదరాబాద్ లలితా జువెలర్స్ లో నగలు చోరీ
  •     5 తులాల బంగారు గాజులను ఎత్తుకెళ్లిన ఇద్దరు మహిళలు

పంజాగుట్ట, వెలుగు: నగలు కొంటున్నట్లు నటించిన ఇద్దరు మహిళలు జువెలరీ షాప్ లో బంగారం కొట్టేశారు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం.. పంజాగుట్టలోని లలిత జువెలరీస్ కు ఈ నెల 6న ఇద్దరు మహిళలు నగలు కొనేందుకు వచ్చారు.

నగలన్నీ చూసి వెళ్లిపోయారు. రాత్రి షాప్ క్లోజ్ చేసే టైమ్ లో నాలుగు బంగారు గాజులు తక్కువగా ఉన్నట్లు మేనేజర్ ప్రసాద్ గుర్తించాడు. ఇద్దరు మహిళలు ఆ బంగారు గాజులను ఎత్తుకెళ్లినట్లు గుర్తించి సోమవారం పంజాగుట్ట పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.