ఝార్ఖండ్‎లో ఈ నెలాఖరు వరకు కరోనా ఆంక్షలు

ఝార్ఖండ్‎లో ఈ నెలాఖరు వరకు కరోనా ఆంక్షలు

దేశంలో కరోనా  కేసులు పెరుగుతుండటంతో  పలు రాష్ట్రాలు  కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఝార్ఖండ్‎లో కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను జనవరి 31వరకు  పొడిగించారు. అక్కడ విద్యాసంస్థలను ఇప్పటికే మూసివేశారు. పెళ్లిళ్లకు  కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మార్కెట్లను రాత్రి 8 గంటలకే మూసివేస్తున్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్‎లో 3,258 కరోనా కేసులు, 14 ఒమిక్రాన్ కేసులు యాక్టివ్‎గా ఉన్నాయి. కరోనా కారణంగా శనివారం ఏడుగురు మరణించారు.

తమిళనాడులో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులు మినహా..  ఎవర్నీ బయటకు  అనుమతించడం లేదు.  పెళ్లిళ్లకు కేవలం 100 మందిని  మాత్రమే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను   75శాతం కెపాసిటీతో రన్ చేస్తున్నారు. ప్రార్థనా  స్థలాలను, శాపింగ్ మాల్స్‎ను   పూర్తిగా మూసివేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  నిన్న ఒక్కరోజే అక్కడ 23 వేల 989 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు.

ఇటు ఢిల్లీ,  జమ్మూకాశ్మీర్‎లోనూ  వీకెండ్ లాక్‎డౌన్  కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సినిమా హాళ్లు , థియేటర్లు, మల్టీప్లెక్స్లు థియేటర్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, జిమ్ములు 25శాతం  సామర్థ్యంతో  రన్ చేస్తున్నారు.  విద్యాసంస్థలు పూర్తిగా మూసివేసి..  ఆన్ లైన్  క్లాసులు చెబుతున్నారు.

For More News..

వాహనాలు కొనాలనుకునే వారికి షాక్.. పెరగనున్న కార్ల ధరలు

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు