న్యూఢిల్లీ : వలస కార్మికులను పంపించడానికి మనదేశం తైవాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. తైవాన్లో పనిచేయడానికి కార్మికులకు శిక్షణ ఇస్తామని తెలిపింది. తైవాన్లో వృద్ధ జనాభా విపరీతంగా పె రుగుతోంది. దీంతో కార్మికులు దొరక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనదేశంలో నిరుద్యోగాన్ని పూర్తిగా తీర్చేంతంగా ఎకానమీ వృద్ధి చెందడం లేదు. ఇటీవల ఇజ్రాయెల్ కూడా మనదేశం నుంచి కార్మికులను తీసుకుంది. యుద్ధం కారణంగా పాలస్తీనా జాతీయులను ఇజ్రాయెల్ రానివ్వడం లేదు. దీంతో భారత్పై ఆధారపడుతోంది.