ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను కేటాయించాలి.. మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి కి జర్నలిస్టుల వినతి

ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను కేటాయించాలి.. మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి కి జర్నలిస్టుల వినతి

మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి కి జర్నలిస్టుల వినతి

హాలియా, వెలుగు:  నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలను కేటాయించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ( ఐజేయు) ఆధ్వర్యంలో మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డికి ఆదివారం నాగార్జునసాగర్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి  కోరారు. ఈ సందర్భంగా జానారెడ్డి సానుకూలంగా స్పందించి అర్హత గల జర్నలిస్టులు అందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  

అనంతరం జానారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వద్దిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు వద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రెస్  క్లబ్ కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పేలపూడి బాల కృష్ణ, దోసకాయల లింగయ్య, అలుగుల వెంకటరెడ్డి, అట్టెం రవి, నామలింగయ్య, చాపల సురేందర్, కరీం, చాపల శ్రీను, రవితేజ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. 

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి 

రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో తల సేమియా వ్యాధి బాధితుల సహాయార్థం అమీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక   ప్రాణాలను కోల్పోతున్నారన్నారు.  రక్తదానం చేసినవారికి ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. 

కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, కాంగ్రెస్​మండల  అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, ఎడవల్లి నరేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, ఫౌండేషన్ బాధ్యులు అమీర్ అలీ, మజాహర్, బాబుద్దీన్, షరీఫ్ పాల్గొన్నారు.