‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్యాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును అందుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సముద్ర తీరం బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు తారక్ బాలీవుడ్ మూవీ ‘వార్2’లోనూ నటించాల్సి ఉంది. ఈ సినిమా కోసం డిసెంబర్ నుంచి డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. ‘వార్2’ కోసం మూడు నెలల కాల్షీట్స్ ఇచ్చాడట. ఇక దీని తర్వాత ప్రశాంత్ నీల్తోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఎన్టీఆర్ కోసం ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేశాడట నీల్.
వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ సెట్స్కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇలా ఒక దాని తర్వాత ఒకటి పర్ఫెక్ట్ ప్లానింగ్తో తారక్ దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప2’లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఈ మూవీ సెట్కి ఎన్టీఆర్ వెళ్లడంతో అటు బన్నీ, ఇటు తారక్ ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని చూపిస్తున్నారు.