ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను..ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ లేఖ

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను..ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ లేఖ

కరోనా బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు లేఖ రాశారు. మే 20న తన పుట్టిన రోజు సందర్బంగా ఎలాంటి వేడుకలు చేయొద్దని సూచించారు. కర్ఫ్యూ , కోవిడ్ రూల్స్ పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. ఇదే మీరిచ్చే అతిపెద్ద కానుకగా భావిస్తానన్నారు.  మీరు పంపిన వీడియోలు, మెసేజ్ లు చూస్తున్నానని మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకుంటాయన్నారు. ఏమీచ్చి మీ రుణం తీర్చుకోగలనంటూ  తన ట్విట్టర్ లో లెటర్ పోస్ట్ చేశారు. త్వరలోనే తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానన్నారు. జాగ్రత్తగా ఉంటూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ..చేతనైన సాయం చేయాలని సూచించారు.