బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మహా పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పూజా సామాగ్రి దుకాణాలను మంత్రి ప్రారంభించారు.
ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మే 10వ తేదీన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుల మత, రాజకీయాలకు అతీతంగా.. ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధిలో అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.
జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని ఈ విషయాన్ని వెల్లడించారు.