స్టైపెండ్​ పెంచకుంటే.. మే 3 నుంచి జూనియర్​ డాక్టర్ల సమ్మె

స్టైపెండ్​ పెంచకుంటే.. మే 3 నుంచి జూనియర్​ డాక్టర్ల సమ్మె

హైదరాబాద్, వెలుగు: స్టైపెండ్ వచ్చే నెల 2లోపు పెంచకుంటే 3 నుంచి సమ్మె చేస్తామని జూనియర్​ డాక్టర్లు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం డీఎంఈ ఆఫీసులో  తెలంగాణ జూనియర్​ డాక్టర్ల అసోసియేషన్​ నోటీసు ఇచ్చింది. స్టైపెండ్​ 15 శాతం పెంచి, జనవరి నుంచే అమలు చేయాలని డిమాండ్ ​చేసింది. మార్చి పెండింగ్​ స్టైపెండ్​ను వెంటనే జమ చేయాలని కోరింది. తమ సమస్యలను పరిష్కరించకుంటే మే 3 నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సర్వీసులను బాయ్​కాట్​ చేస్తామని హెచ్చరించింది.