ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదారాబాద్: జూనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. బాచుపల్లిలోని జేఎస్ ఘెలాట్ అకాడమీలో పోటీలను మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు.
గురువారం (ఫిబ్రవరి 1) నుంచి నాలుగు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో 29 రాష్ట్రాలనుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ పాల్గొంటున్నాయి. అమెచ్చూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలోజూనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నారు.