పర్వతగిరి మండలం తురుకల సోమారం వద్ద ఆర్టీసీ బస్సు టైరు ఊడిపోయింది. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి అన్నారం వెళ్తుండగా తురుకుల సోమారం, గుంటూర్పల్లి గ్రామాల మధ్య ఒక్కసారిగా వెనుక టైరు ఊడిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నీలగిరి స్వామి తండా శివారులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మకొండకు వెళ్తుండగా నీలగిరి స్వామి తండా శివారు వద్ద లూనావత్వెంకన్న అనే వ్యక్తి బైక్పై రోడ్డుపైకి వచ్చాడు. ఈ క్రమంలో బైక్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకన్నను ఆస్పత్రికి తరలించారు. దీంతో గిరిజనులు కాసేపు రోడ్డుపై ఆందోళన చేయడంతో పోలీసులు నచ్చజెప్పి పంపించారు.
నారాయణపేట నుంచి మక్తల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఊట్కూర్ బస్టాండ్వద్ద నిలిపి ఉంచిన బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకున్నా బైక్ దెబ్బతింది.