
తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సివి రాములు, డిప్యూటీ లోకాయుక్తగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి వి.నిరంజన్ రావు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ తమిళిసై, కేసీఆర్ వీరికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
సీవీ రాములు నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని అచ్చనపల్లిలో 1949 లో జన్మించారు. హైస్కూల్ విద్యను బోధన్లో, డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీలో పూర్తిచేశారు. ఔరంగాబాద్లోని మరాఠ్వాడా వర్సిటీలో LLB పూర్తిచేసిన ఆయన.. 1978లో లాయర్ గా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 24ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. 2002లో ఏపీ అదనపు జడ్జిగా ఎలివేట్ అయ్యారు. 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2011లో రిటైర్ అయ్యారు.