తాత్కాలిక సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం

తాత్కాలిక సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర  హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్.. కోల్‌‌కత హైకోర్టుకు ఈ మధ్యే బదిలీ అయ్యారు. దీంతో సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ చౌహాన్ ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టులో ప్రస్తుతం 11మంది న్యాయమూర్తులు ఉన్నారు.