
ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) విజయవంతంగా పూర్తయింది. ఈ సీజన్ కు గాను.. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలువగా.. నటుడు అమర్ దీప్ రన్నరప్ గా నిలిచారు. ఇక సీజన్ 7 ముగిసినప్పటి నుండి బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టేశారు ఆడియన్స్. ఇందులో భాగంగానే బిగ్ బాస్ కొత్త సీజన్ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 త్వరలోనే మొదలుకానుందట. ఫిబ్రవరి చివరివారంలో ఈ కొత్త సీజన్ మొదలుకానుందని సమాచారం.
దీంతో బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరా? అంటూ సెర్చింగ్ మొదలుపెట్టేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికే సెలెక్షన్స్ కూడా మొదలయ్యాయట. అందులో కాకినాడ పిల్ల సెలెక్ట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ కాకినాడ పిల్ల ఎవరంటే. ఈమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సన్. బామ్మర్ది బామ్మర్ది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటుంది. అంతేకాదు బిగ్ బాస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ని కూడా ఇంటర్వ్యూ చేసింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
దీంతో ఆమె ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే పాత కంటెస్టెంట్స్ అందరిని ఆమె కలుస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి నిజంగా ఆమె బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లనుందా అనేది తెలియాలంటే సీజన్ మొదలయ్యేవరకు ఆగాల్సిందే.