దేశమంతా ఇష్టపడే స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఒకేసారి కేరీర్ మొదలు పెట్టడమే కాదు.. మంచి ఫ్రెండ్స్ కూడా. నటుడిగా రజినీ ఈ మధ్యే నలభై ఐదేళ్లు పూర్తి చేసుకుంటే.. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ అరవయ్యొక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. నటనలో వీరిద్దరిదీ చెరో దారి. ఒకరు మాస్, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయితే.. మరొకరు ఎక్స్పెరిమెంట్స్కి కేరాఫ్. వీరిద్దరి కలయికలో సినిమా వచ్చి ఎన్నోయేళ్లు అయ్యింది. రీసెంట్గా రజినీకాంత్ హీరోగా కమల్ నిర్మాతగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలొచ్చాయి. ‘అన్నాత్తే’ తర్వాత రజినీ సినిమా ఇదేనన్నారు. కానీ కరోనాతో సినిమాల షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ క్రమంలో రజినీ – కమల్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కొంత నిరాశపడ్డారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరో కన్ఫర్మేషన్ వచ్చింది. కార్తితో ‘ఖైదీ’ పూర్తయిన తర్వాత విజయ్తో ‘మాస్టర్’ తీసిన లోకేష్.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రస్తావించాడు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాకే ఆ సినిమా గురించి మాట్లాడతానన్నాడు. అంటే ఈ సినిమా చేస్తున్నట్టు లోకేష్ ఇన్డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. వచ్చే నెలలో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
For More News..