Success: పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా

 Success: పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా

ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్​షిప్ అనేది పారా అథ్లెటిక్స్ క్రీడలో అత్యున్నత స్థాయి పోటీ. ఇది అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీలోని వరల్డ్ పారా అథ్లెటిక్స్​లోని వరల్డ్ పారా అథ్లెటిక్స్ విభాగం ద్వారా నిర్వహిస్తారు. 

బ్రాండ్ అంబాసిడర్: ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్​షిప్​కు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరించనున్నారు. 
నిర్వహణ: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
2025 చాంపియన్ షిప్: 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్​షిప్ 2025లో భారతదేశంలో ఢిల్లీలో జరగనున్నది. 
తేదీలు: 2025, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు. 
వేదిక: ఢిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ స్టేడియం.
ప్రత్యేకత: భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద పారా స్పోర్టింగ్ ఈవెంట్ ఇది.