కొండచరియలు పడి పట్టాలు తప్పిన రైలు

కొండచరియలు పడి పట్టాలు తప్పిన రైలు

కన్నూరు టూ బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు కొండచరియలు విరిగిపడి ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్, శివడి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.  ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2 వేల 348 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వేశాఖ ప్రకటించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.