కన్నూరు టూ బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు కొండచరియలు విరిగిపడి ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్, శివడి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2 వేల 348 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వేశాఖ ప్రకటించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
Around 3.50 am today, 5 coaches of Kannur-Bengaluru Express derailed b/w Toppuru-Sivadi of Bengaluru Division, due sudden falling of boulders on the train. All 2348 passengers on board are safe, no casualty/injury reported: South Western Railway (SWR)
— ANI (@ANI) November 12, 2021
(Photo source: SWR) pic.twitter.com/Yq9hhxIkQo