డబుల్ ట్విన్స్ : ఒకే కాన్పులో నలుగురు పుట్టారు

డబుల్ ట్విన్స్ : ఒకే కాన్పులో నలుగురు పుట్టారు

కరీంనగర్ : కవల పిల్లలు పుడితేనే అమ్మో అంటాం. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నిఖిత.. డబుల్ ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో ఆమెకు నలుగురు పుట్టారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పిల్లలు బరువు తక్కువగా ఉండడంతో చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది నెలల క్రితం ఇదే ఆస్పత్రిలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది నిఖిత సోదరి లిఖిత. నిఖిత, లిఖితలు కూడా కవల పిల్లలే. అక్కాచెల్లెళ్లు అయిన నిఖిత, లిఖితకు కవల పిల్లలు పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.