పునీత్​కు కర్నాటక రత్న అవార్డు

పునీత్​కు కర్నాటక రత్న అవార్డు

పునీత్ భార్యకు ‘కర్నాటక రత్న’ అవార్డు అందజేత

బెంగళూరు : ప్రముఖ కన్నడ యాక్టర్ పునీత్​ రాజ్​కుమార్​కు కర్నాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారం దక్కింది. ఆయన మరణానంతరం కర్నాటక రత్న అవార్డును పునీత్ కుటుంబ సభ్యుల సమక్షంలో అతని భార్య అశ్వినికి అవార్డును సీఎం బసవరాజ్ బొమ్మై అందజేశారు. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని పొందిన 9 వ వ్యక్తిగా పునీత్ పేరు రికార్డుకెక్కింది. మంగళవారం కర్నాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని విధాన సౌధ వద్ద అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. చీఫ్ గెస్టులుగా ప్రముఖ యాక్టర్లు రజనీకాంత్, ఎన్టీఆర్, ఇన్ఫోసిస్ చైర్‌‌పర్సన్​ సుధామూర్తి హాజరయ్యారు.

సభా వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అదే సమయంలో వర్షం పడినప్పటికీ విధాన సౌధ రోడ్డు కిటకిటలాడింది. కాగా, కర్నాటక రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి పునీత్ తండ్రే కావడం విశేషం. 1992లో ప్రముఖ కవి కువెంపుతోపాటు పునీత్ తండ్రి రాజ్​కుమార్​ అవార్డును అందుకున్నారు.