‘కార్తికేయ2’ మోషన్ పోస్టర్ విడుదల

‘కార్తికేయ2’ మోషన్ పోస్టర్ విడుదల

నిఖిల్ సిద్ధార్థ్  హీరోగా ‘కార్తికేయ 2’ మూవీ రాబోతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇంతకుముందు కార్తికేయ సినిమా కూడా ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చింది. మరోసారి మిస్టరీ థ్రిల్లర్ తరహా కథతోనే చందూ మొండేటి.. ‘కార్తికేయ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ జూలై 22న తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను (మలయాళ భాషలో)  బుధవారం ఉదయం విడుదల చేశారు. ఒక బోటులో హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సముద్ర ప్రయాణం చేస్తున్న దృశ్యం ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. 5000 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న కొన్ని పౌరాణిక ఘటనల ఇతివృత్తం చుట్టూ  ఈ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ‘కార్తికేయ 2’లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు. 

మరిన్ని వార్తలు..

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కన్నుమూత

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!