‘కార్తికేయ 2’.. 48 గంటల్లో 100 కోట్ల నిమిషాల స్ట్రీమింగ్

‘కార్తికేయ 2’.. 48 గంటల్లో 100 కోట్ల నిమిషాల స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆగస్ట్ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేశారు. దసరా పండుగ రోజున ‘జీ5’ ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఇక్కడ కూడా దూసుకుపోతుంది. 48 గంటల్లో 100 కోట్ల నిమిషాలకు పైగా ఈ సినిమా స్ట్రీమింగ్ జరిగినట్లుగా జీ5 ఓటీటీ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలియజేసింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇంకా ఈ సినిమా బాలీవుడ్‌లోని కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలాగే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఫుల్‌ రన్‌లో ఈ చిత్రం దాదాపు రూ.120 కోట్ల వరకు కలెక్షన్‌లను రాబట్టి నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌లను సాధించిన సినిమాగా నిలిచింది. మరోవైపు ప్రస్తుతం కార్తికేయ 3 చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.